ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?

-

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అందులో ఒకటి ఆయుస్మాన్ భారత్..ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది.ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది..ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పథకం కింద చికిత్స పొందుతున్న వ్యక్తి ఆస్పత్రి ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నప్పుడే దీనికి అర్హులు అవుతారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెప్పవచ్చు..ఈ పథకం కింద 10.74 కోట్ల కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది..

ఆయుస్మాన్ కార్డును ఎలా పొందాలి?

  •  ముందుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి..
  • అక్కడ మీ పేరు జాబితాలో ఉందో లేదో అధికారులు తనిఖీ చేస్తారు.
  • ఆయుష్మాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు నమోదు అయి ఉంటే మీరు కార్డు పొందుతారు.
  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి అన్ని పత్రాలు
  • ఫొటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో సదరు అధికారికి సమర్పించాలి.
  • తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు.
  • రిజిస్ట్రేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందిస్తారు.
  • మీ ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మీకు కార్డు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news