ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి హెచ్చరిక.. ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు..!

-

ఈ మధ్య కాలంలో సైబర్​ నేరాలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఫోన్​, మెసేజెస్, ఈ–మెయిల్, క్యూఆర్​ కోడ్, లాటరీ ఇలాంటి వాటి ద్వారా డబ్బు కాజేస్తున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పీఎఫ్​ అకౌంట్లలోని అమౌంట్​ను కూడా వదలడం లేదు. అందుకనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫ్రాడ్స్ గురించి చెబుతోంది.

 

epf

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఫ్రాడ్స్టర్స్ బారిన పడకుండా ఈపీఎఫ్​ ఖాతా వ్యక్తిగత వివరాలు, ఓటీపీ లాంటి ముఖ్యమైన వివరాలను ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోకూడదు. ఈపీఎఫ్​ లింక్డ్ ఓటీపీల ద్వారా మోసాలు పెరుగుతున్నందున ఈపీఎఫ్ హెచ్చరించింది. ఆధార్ కార్డ్ నంబర్, పాన్​ నంబర్​, బ్యాంక్ ఖాతా నంబర్, UAN నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు.

కాల్​ ద్వారానే కాదు వాట్సాప్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్​ ద్వారా ఎవరికీ షేర్ చెయ్యకూడదు. అందుకనే ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వాటిని సోషల్ మీడియాలో కానీ ఫోన్ లో కానీ షేర్ చేసుకోకండి. దీని వలన ఇబ్బంది వస్తుంది. ఈపీఎఫ్​ఓకు సంబంధిన ఏవైనా సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే EPFO ​​అధికారిక వెబ్‌సైట్ – www.epfindia.gov.in ని సంప్రదించమని అంది. అదే విధంగా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో భద్రంగా ఉంచుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news