బాలకృష్ణ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్న కత్రినాకైఫ్..!

-

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్రతారగా ఎదిగిన కత్రినా కైఫ్ మొదటిగా తెలుగులో మల్లీశ్వరి సినిమాలో నటించింది. మీర్జాపూర్ యువరాణి మల్లీశ్వరి పాత్రలో కత్రినా కైఫ్ చాలా అందంగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఒక మలయాళం మూవీలో నటించిన కత్రినా కైఫ్ తదనంతరం బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. 2005వ సంవత్సరంలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వం లో తెరకెక్కిన అల్లరి పిడుగు చిత్రంలో బాలకృష్ణ, ఛార్మి కౌర్, కత్రినాకైఫ్ నటించారు. ఈ సినిమా సెట్ లో కత్రినా కైఫ్ దిగిన ఓ ఫోటో మొన్నామధ్య తెగ వైరల్ అయింది. కత్రినా కైఫ్ ఎంత ఎదిగినా తెలుగు సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేదని తాజాగా ఆమె మాట్లాడిన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

balayya
balayya

అప్పట్లో కొత్తగా సినీరంగంలో అరంగేట్రం చేసిన కత్రినాకైఫ్ తాను నటిస్తున్న సినిమాలోని పాటలకు డాన్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడిపోయేది. నటనాపరంగా అందరినీ బాగానే మెప్పించేది. కానీ, డాన్స్ విషయానికి వచ్చేసరికి ఆమె చాలా తడబడిపోయేది. దీంతో చాలామంది ఆమెను చూసి గొల్లున నవ్వేవారు. కానీ బాలకృష్ణ మాత్రం కత్రినా కైఫ్ బాధని అర్థం చేసుకొని పాటలకు డాన్స్ ఎలా వేయాలో మెళకువలు నేర్పించాడు. ఆ తర్వాత కత్రినాకైఫ్ తన సినిమాల్లో పాటలకు డ్యాన్స్ వేసేందుకు అంతగా ఇబ్బంది పడలేదట.

బాలకృష్ణ చెప్పిన అన్ని మెళకువలను శ్రద్ధగా పాటిస్తూ తన తదుపరి సినిమాల్లో మంచిగా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశానని కత్రినాకైఫ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటికీ ఆమె తన సినిమాల్లో బాలకృష్ణ చెప్పిన నాట్య మెళకువలను గుర్తుకు తెచ్చుకొని డాన్స్ వేస్తానని చెబుతోంది. అలాగే బాలకృష్ణ తనకు డాన్స్ గురువు అని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తుంటే కత్రినాకైఫ్ మన తెలుగు సినిమాలను, హీరోలను మర్చిపోలేదని స్పష్టమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news