టీడీపీకి మరో భారీ షాక్… వైసీపీలోకి మరో ఎమ్మెల్యే

-

విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. వారం రోజుల క్రితం విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమరావతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఆయన ఆయన పార్టీ కండువా మెడలో వేసుకోలేదు. వాసుపల్లి గణేష్ కుమారులు ఇద్దరికీ కండువాలు కప్పిన సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించిన విషయం విధితమే… అయితే ఈ షాక్ నుంచి టీడీపీ నేతలు బయటపడకముందే మరో షాక్ తగిలింది.


ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న టిడిపి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. వచ్చే నెల 5వ తేదీన సీఎం సమక్షంలో వైసీపీలోకి చేరనున్నారు. విశాఖ నగరం నుంచి ఆ పార్టీలో చేరిన వారి సంఖ్య 2 కు చేరుకుంది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అమలు పరుస్తున్న పథకాల తీరును చూసి ఆయన కష్టపడుతున్నారని అర్థం చేసుకొని ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news