గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాటర్ బోర్డ్ అధికారులు కీలక సూచనలు చేశారు..శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం ఆరుగంటల వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగతుందని అధికారులు తెలిపారు..హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్యపాత్రపోశిస్తున్న కృష్ణా ఫేజ్-2 పథకంలోని పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారని..దీంతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలైన మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌస్, కాకతీయనగర్, హుమాయున్నగర్, తల్లాగడ్డ, అసిఫ్నగర్, ఎంఈఎస్, షేక్పేట, ఓయూ కాలనీ, టౌలిచౌకి, మల్లేపల్లి, విజయ్నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్హిల్స్ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు..గ్రేటర్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా..సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అల్లాబండ, గగన్మహల్, హిమాయత్నగర్, బుద్వేల్, హైదర్గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్ మెట్, కిషన్బాగ్, గంధంగూడ, కిస్మత్పురా ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు.
హైదరాబాద్ ప్రజలకు వాటర్ బోర్డ్ అధికారులు హెచ్చరిక..ఈ ప్రాంతాలలో నీటి సరఫరా బంద్!
By rajesh ch
-
Previous article
Next article