దారుణం.. దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

-

చెన్నై: తిరువన్నామలై జిల్లా అరణిలో దారుణం జరిగింది. దెయ్యం పట్టిందని కొడుకును తల్లి కొట్టి చంపేశారు. కొడుకు కొంతకాలంగా మానశిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె ఓ స్వామీజీని కలిసినట్లుగా తెలుస్తోంది. తన కొడుకుకు దెయ్యం పట్టిందని స్వామీజీ చెప్పారు. దాంతో కొడుకు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దెయ్యం తన కొడుకును ఆవహించిందని మూడు రోజులుగా కొడుతూనే ఉన్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అత్యంత రాక్షంగా వ్యవహరించారు.

దెయ్యం ఆత్మను వదిలించేందుకు తన కుమారుడిని కొట్టినట్లు బాలుడి తల్లి అంటున్నారు. తన కొడుకు మళ్లీ తిరిగి వస్తాడని చెబుతున్నారు. అంతేకాదు బాలుడు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌ సమీపంలోకి తీసుకెళ్లి నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలుడి ప్రాణం పోయింది. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలు తల్లి మానసిక పరిస్థితి సరిగాలేదని, ఆస్పత్రిలో వైద్యం అందించి తర్వాత రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news