ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా పాజిటివ్

-

ఎన్సీపీ పార్టీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తన వైద్యుడి సూచించిన విధంగా చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవల నన్ను కలుసుకున్న వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అందరూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నానని ట్విట్టర్ లో తెలిపారు. 

థర్డ్ వేవ్ నేపథ్యంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిలిం స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వారి అనుచరుల్లో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనా బారి పడ్డారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు ఓమిక్రాన్ కూడా విస్తరిస్తోంది. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news