కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు మహిళలకే ఇస్తాం : రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు మహిళలకే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. గాంధీ గారు చేపట్టిన శక్తి యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మై లఢీకి లడ్ సక్తా హు కార్యక్రమంలో భాగంగా ఇందిరా భవన్ లో చేపట్టిన కార్యక్రమంలో ప్రసంగించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అంతా మహిళలే.. ప్రతిభ పాటిల్ ను రాష్ట్రపతి చెందిన ఘనత కాంగ్రెస్ పార్టీ దన్నారు. మహిళల వల్లనే తెలంగాణ సాకారం అయ్యిందని.. తెలంగాణ కేసీఆర్ వల్ల తెలంగాణ లో ఎక్కువ నష్టపోయింది మహిళలేనని వెల్లడించారు. మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రెండో దఫా ప్రభుత్వంలో కాంగ్రెస్ పోరాటంలో ఇద్దరికి మంత్రి పడవినిచ్చారని వెల్లడించారు. టిఆర్ఎస్ సర్కార్ ను పడగొట్టి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news