“భీమ్లా నాయక్” కు జగన్ షాక్..అన్ని థియేటర్లు జీవో 35 పాటించాలని ఆదేశాలు !

-

గత కొన్ని రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్ టికెట్ల విధానం నుంచి.. రోడ్ల సమస్యల వరకూ ప్రతిభ వాటిలోనూ జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టం వచ్చేలా వ్యవహరిస్తోంది.

ఇక ఎల్లుండి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది. ఈ తరుణంలో పవర్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ… జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లా నాయక్ సినిమా నడిచే థియేటర్లు అన్నీ జిఓ 35ని ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు థియేటర్ యజమానులు మరియు పంపిణీదారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త G.O మార్చి 1వ వారంలో మాత్రమే వెలువడుతుందని…. అప్పటి వరకు జిఓ 35ని ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news