అప్పటివరకూ సాధారణ వస్తువు అనుకుంది.. అమ్మితే రూ. కోట్లు వచ్చేశాయ్..!

-

పరిస్థితి బాలేనప్పడు ఉన్న ఇంటిని, ఇంట్లో సామాన్లు అమ్ముకోవడం సహజమే.! ఓ వృద్ధురాలు కూడా ఖర్చులకు డబ్బులేవ్వని ఇంట్లో వస్తువులను అమ్మాలనుకుంది. అప్పుడే ఆమెకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. అప్పటి వరకూ ఎందుకుపనికిరానిది అనుకున్న పెయింటింగ్..రూ.2కోట్లు విలువైనదని తెలిసి ఆ వృద్ధురాలికి మైండ్‌ బ్లాక్‌ అయింది. లైఫ్‌ దెబ్బకి యూటర్న్ తీసుకున్నట్లైంది.!

నార్త్ లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో ఓ బంగ్లా ఉంది. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే నివసించింది. తన తండ్రి కాలం నుండి అతని పడకగదిలో ఒక అందమైన పెయింటింగ్ ఉండేది. అతను దానిని పట్టించుకోలేదు. ఇది సాధారణ పెయింటింగ్ అని ఆమె భావించింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వస్తువులను అమ్మేందుకు సిద్దమవడంతో.. ప్రజలు వస్తువులను కొనడానికి ఆమె ఇంటికి వచ్చారు. శతాబ్దాల నాటి ఈ చారిత్రక పెయింటింగ్‌ను ఒక కళాకారుడు గమనించాడు. ఈ ఇల్లు తన తండ్రి నుండి ఈ వృద్దురాలికి వారసత్వంగా వచ్చింది. అదే ఇంటి పడకగదిలో 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ పెయింటర్ ఫిలిప్పినో లిప్పి పెయింటింగ్ మడోన్నా అండ్ చైల్డ్ నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఇది చారిత్రాత్మకమని ఆ మహిళ ఎప్పుడూ గ్రహించలేదు. మహిళకు ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆమె ఇంట్లోని కొన్ని వస్తువులను విక్రయించాలని భావించింది, అప్పుడే ఈ పెయింటింగ్‌లోని రహస్యం చారిత్రాత్మకమైనదని తేలింది. ఈ పెయింటింగ్ సాధారణ పెయింటిగ్‌ కాదని.. చారిత్రకమైనది కళాకారుడు వెంటనే గుర్తించాడు. ఇంటి యజమానురాలు చిన్న వయసులోనే ఇటలీ వెళ్లిందని.. తండ్రి చనిపోవడంతో యూకే వచ్చేసరికి ఇంటితో పాటు పెయింటింగ్ కూడా వచ్చింది. 30 ఏళ్లుగా ఇక్కడ నివసించినా దాని ప్రాముఖ్యత గుర్తించలేదు. ఇప్పుడు పెయింటింగ్ £2,55,000 అంటే దాదాపు రూ.2 కోట్లకు అమ్ముడుపోయింది.

అలా ఆ ముసలావిడను అదృష్టం వరించింది. మన ఇంట్లో కూడా.. ఏమైన పురాతన వస్తువులున్నాయేమో అనే ఆలోచన మీకూ వచ్చే ఉంటుంది కదా..! ఏమో ఉండొచ్చేమో!

Read more RELATED
Recommended to you

Latest news