తాత బాటలో మనవడు హిమన్షు : ఎంపీ సంతోష్‌ కుమార్‌

-

సీఎం కేసీఆర్‌ మనవడికి హిమన్షు అందరికీ సుపరిచితుడే.. అయితే నేడు హిమాన్షు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు బ‌ర్త్ డే సందర్భంగా త‌న కుటుంబానికి చెందిన ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్ కుమార్‌ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో స్వ‌యంగా ఓ మొక్క‌ను ఆయ‌న నాటారు. ఈ ఫొటోల‌ను ఎంపీ సంతోష్ కుమార్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా హిమాన్షు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సంతోష్ కుమార్‌.

Image

హిమాన్షు కూడా త‌న తాత కేసీఆర్ బాట‌లోనే న‌డుస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. హ‌రిత హారంతో తెలంగాణ‌ను స‌శ్య‌శ్యామలం చేసే దిశ‌గా హ‌రిత హారం ప్రాజెక్టుకు కేసీఆర్ పునాది వేస్తే… తాను కూడా ఆ దిశ‌గానే సాగుతాన‌ని బ‌ర్త్ డే నాడు హిమాన్షు మొక్క నాటార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… బ‌ర్త్ డే బాయ్ హిమాన్షుకు విషెస్ చెబుతున్నారు టీఆర్ఎస్‌కు చెందిన ప‌లువురు నేత‌లు.

Read more RELATED
Recommended to you

Latest news