దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరుగుతుంది. అదే సమయంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నీతీష్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఉదయం చేసిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నితీష్ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.
జ్వరం కారణంగా నితీష్ కుమార్ గత కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు, నూతన రాష్ట్రపతిగా ద్రౌపది మురుము ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కూడా నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మధ్య తనని కలిసిన వాళ్ళు కరోనా టెస్టులు చేయించుకోవాలని నితీష్ కుమార్ సూచించారు.