ముస్లిం మహిళలను ఎవ్వరినీ వదలకండి.. అందరిపై అత్యాచారం చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

-

ముస్లింలకు ఒకటే పరిష్కారం. హిందూ సోదరులంతా గుంపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. కనీసం 10 మంది గ్రూప్ గా ఏర్పడి ముస్లిం మహిళలపై అత్యాచారం చేయడి. ముస్లిం తల్లులను, సోదరీమణులను కూడా వదలకండి. రోడ్డు మీదనే వాళ్లపై అత్యాచారం చేయాలి.

అవును.. మీరు చదివింది నిజమే. అక్షరాలా ఓ మహిళే ఈ మాటలు అన్నది. ఓ మహిళ అయి ఉండి ఇతర మహిళలపై చాలా చీప్ గా మాట్లాడింది. ఆమె ఎవరో కాదు.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్. అవును.. ఆమె ఫేస్ బుక్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని రామ్ కోల బీజేపీ మహిళా మోర్చా చీఫ్ ఆమె.

ఇంతకీ ఆమె తన ఫేస్ బుక్ లో ఏమని పోస్ట్ చేసిందంటే… ముస్లింలకు ఒకటే పరిష్కారం. హిందూ సోదరులంతా గుంపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. కనీసం 10 మంది గ్రూప్ గా ఏర్పడి ముస్లిం మహిళలపై అత్యాచారం చేయడి. ముస్లిం తల్లులను, సోదరీమణులను కూడా వదలకండి. రోడ్డు మీదనే వాళ్లపై అత్యాచారం చేయాలి. వాళ్లందరినీ నడిరోడ్డు మీద బహిరంగంగా ఉరితీయాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మనకు వేరే దారి లేదు. అదొక్కటే దారి. ఖచ్చితంగా హిందూ సోదరులు ఆపని చేయాల్సిందే.. అంటూ ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

ఆమె చేసిన పోస్ట్ ను ఓ వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దానిపై పెద్ద దుమారమే లేచింది. ఈ ఘటనపై బీజేపీ అధిష్ఠాన తీవ్రంగానే స్పందించింది. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్లను సహించేదే లేదు.. అంటూనే సునీతను పార్టీ నుంచి వెంటనే బహిష్కరిస్తున్నట్టు తెలిపింది.

కొంచెం లేటుగా తన తప్పును తెలుసుకున్న సునీత.. వెంటనే తన పోస్టును డిలీట్ చేసినప్పటికీ అప్పటికే తన పోస్ట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news