ఆదివాసీ గిరిజన సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలి : సత్యవతి రాథోడ్

-

గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఆదివాసీ గిరిజన సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కోరారు సత్యవతి రాథోడ్. హైదరాబాద్‌లో ఒక్కొక్కటి రూ.22 కోట్లతో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను సీఎం ఈనెల 17వ తేదీన ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో సభా కార్యక్రమం ఉంటుందన్నారు సత్యవతి రాథోడ్. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్ష 25 వేల మంది సభకు హాజరు కానున్నారని, మహబూబాబాద్‌ జిల్లా నుంచి పదివేల 666 మంది సభకు హాజరవుతున్నట్లు తెలిపారు సత్యవతి రాథోడ్.

Telangana Assembly Constituency MLC Satyavathi Rathod - Telangana data

పేద గిరిజన జీవితాలతో ముడిపడే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు సత్యవతి రాథోడ్. పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక అనుసరించి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, త్వరలోనే లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నామని తెలిపారు సత్యవతి రాథోడ్. గిరిజన ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి కై 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news