ఏపీలో దారుణం..ఆశావర్కర్ పై లైంగిక దాడి

-

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఆశ వర్కర్ గా చేస్తున్న మహిళ రెండు రోజుల క్రితం ఫోన్ పోగొట్టుకుంది.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

ఫోన్ తమ వద్ద ఉందని గ్రామానికే చెందిన నలుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. సామూహిక అత్యాచారం చేసి ఆపై చంపేశారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా అనుపు చెంచుకాలనీ శివారులో ఆదివారం శవమై కనిపించింది. నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మృతురాలికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news