Breaking : ఆపరేషన్‌ కొబ్బరి బొండ.. పుష్పను మించిన ప్లాన్‌

-

రోజు రోజుకు స్మగ్లర్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే.. ఇటీవల విడుదలైన ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా చూసే ఉంటారు. అయితే.. ఆ సినిమాలో హీరో వినూత్న రీతిలో ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్‌ చేసినట్లుగానే.. ఇక్కడ ఓ ముఠా గంజాయిని స్మగ్లింగ్‌కు తెరలేపారు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి ముఠా ఆట కట్టించారు ఎస్‌ఓటీ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 900కిలోల గంజాయిను స్వాధీనం చేసుకుని.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Ganja peddler held near school - Telegraph India

ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరి బొండాల ముసుగులో ఒడిస్సా రాష్ట్రం మల్కన్ గిరి నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ఎల్బీనగర్, ఆలేరు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన యోగేష్ దత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మల్కన్ గిరి నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఒడిస్సా రాష్ట్రంలో కేజీ గంజాయిని 2 నుంచి 3 వేల రూపాయలకు విక్రయించి.. మహారాష్ట్రలో సుమారు రూ.15 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వికాస్, వినోద్, కిషోర్, చిట్టిబాబు అనే వ్యక్తులు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news