అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చొరబడుతున్న చైనా సైన్యం.. ‘కీడా జోడీ’ కోసమే..!!

-

చైనా సైనికులు ఈ మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి వస్తూపోతున్నారు. వీళ్లు ఎందుకు ఇలా వస్తున్నారా అని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. చైనా వాళ్లు పెద్ద స్కెచ్చే వేశారు. ఇండో పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఎంతో విలువైన ‘కీడా జోడి’ కోసం చైనా సైనికులు ఇలా చొరబడుతున్నట్టు తేలింది. వాటిని అమ్ముకుంటే లక్షల్లో డబ్బులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే బంగారం కన్నా ఇవి ఎంతో విలువైనవి.

కీడా జోడిని ఏరి పట్టుకెళ్లేందుకు చైనా సైనికులు వస్తున్నారట. వీటిని ‘హిమాలయన్ వయాగ్రా’ అని కూడా పిలుస్తారు. లైంగిక సమస్యలను ఇది చాలా సమర్ధంగా పనిచేస్తుంది.. హిమాలయా ప్రాంతాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్ ఇది.. వీటిని హిమాలయన్ గోల్డ్ అని పిలుస్తారు. ఇవి పుట్టగొడుగుల వర్గానికి చెందినవని. చూడటానికి గొంగళి పురుగుల్లా ఉంటాయి. ఇవి కిలో దొరికాయంటే లక్షాధికారి అయిపోవచ్చు. కిలో 20 నుంచి 25 లక్షలు ఉంటాయట… ముఖ్యంగా విదేశాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. ప్రపంచంలో అత్యంత అరుదైన శిలీంధ్ర జాతుల్లో ఇవి కూడా ఒకటి.

ఎందుకంత కాస్ట్..

వీటిలో ఉండే శక్తివంతమైన ఔషధ గుణాలు వేరే ఏ పదార్థంలోనూ ఉండవు. ఒకటా రెండా మీరే చూడండి… యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ఫైబ్రోటిక్, యాంటీ హెచ్ఐవి, యాంటీ మలేరియా, యాంటీ డిప్రెషన్, యాంటీ ఆస్టియోపోరోసిస్… ఇలా దీనిలో లెక్కలేనని గుణాలు ఉన్నాయి. అలాగే ప్రొటీన్లు, పెప్టైడ్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి1, బి2, బి12 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో రకాల జబ్బులను రాకుండా అడ్డుకోగలదు. జబ్బులు వచ్చిన వారికి వాటితో గట్టిగా పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. అందుకే ఇవి బంగారం, ప్లాటినం, వజ్రాల కన్నా ఎన్నో రెట్లు విలువైనవి.

ఎలా పెరుగుతాయంటే..

వీటిని స్కార్లెట్ గొంగళి పురుగులు అని కూడా అంటారు. ఈ పురుగులు ఆల్పైన్ గడ్డి, పొద భూములలో పెరగడానికి అయిదేళ్లు పడుతుంది. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు ఫంగస్ దాడి చేస్తుంది. గొంగళి పురుగులోని కణాలను తన కణాలతో భర్తీ చేస్తుంది. అయిదు నుంచి 15 సెంటీమీటర్ల పొడవున స్తంభాల్లా పుట్టగొడుగు ఆకారంలో ఇవి పెరుగుతుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు. సముద్ర మట్టానికి 3,800 ఎత్తులో హిమాలయాల్లో గడ్డి ఉండే ప్రాంతాల్లోనే పెరుగుతాయి. మనదేశంతో పాటూ నేపాల్, భూటాన్, చైనాలోనూ ఇవి లభిస్తాయి. వీటి ఉత్పత్తిలో చైనానే ముందుంది. ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తోంది. అందుకే వాళ్లకు వీటి గురించి బాగా తెలుసు..

కేవలం పది గ్రాముల కీడా జడిని కొనాలంటే యాభై ఆరువేల రూపాయలు ఖర్చు పెట్టాలి. హిమాలయాలకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వీటిని ఏరుకుంటూ పర్వతాల మీదకి వెళతారు. అలా వెళ్లిన వాళ్లలో చాలా మంది వెనక్కి తిరిగి రాలేదు. వీటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇంత ఖరీదైన వాటికోసం.. చైనా సైన్యం అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి అత్తారింటికి వచ్చి వెళ్లినట్లు వెళ్తుంది. మరీ ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.!

Read more RELATED
Recommended to you

Latest news