టీడీపీలో ముసలం.. గంటాకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై అయ్యన్న ఆగ్రహం

-

ఉమ్మడి విశాఖ జిల్లాల టీడీపీలో ముసలం నెలకొంది. ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం కోసం రేపు విశాఖకు వస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి గంటాకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీసీ సదస్సుకు గైర్హాజర్యారు అయ్యన్న.

చంద్రబాబు సమావేశానికి అయ్యన్న వస్తారా…? లేదా….? అనే ఆసక్తి నెలకొంది. ఇక అటు పాయకరావుపేట టిడిపిలో బయటపడ్డ వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా టిడిపిలో ఓ వర్గం సమావేశం అయింది. అనిత ఫిర్యాదు పై పాయకరావుపేటకు చెందిన ఇద్దరు టిడిపి నాయకులపై వేటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news