మోడీ అసమర్థ ప్రధాని – మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

మహబూబ్నగర్ జిల్లా: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరువు తప్ప అభివృద్ధి తెలియని జిల్లా పాలమూరు అని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు వలసల జిల్లాగా పాలమూరు ను మార్చారని మండిపడ్డారు.

డెబ్భై ఏండ్ల పాలనలో కరువు వలసలు మాత్రమే పాలమూరు జిల్లా చూసిందన్నారు. ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుందని.. పెండింగ్ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ పూర్తి చేశారని వివరించారు. పాలమూరు లో వేరే రాష్ట్రం నుండి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ లో మొట్టమొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చేశారని వివరించారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ప్రశాంత్ రెడ్డి. రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందని.. రేవంత్ తనకుతాను గొప్ప నాయకుడని ఊహించుకుంటున్నాడన్నారు.

పిచ్చి మాటలు మానుకోవాలని రేవంత్ ను హెచ్చరిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తాడని ఆరోపించారు. ఇక నరేంద్రమోదీ అసమర్ధ ప్రధానని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం నరేంద్రమోదీ పనితనం అని ఏద్దేవా చేశారు ప్రశాంత్ రెడ్డి. పెట్రోల్, డిజిల్ ధర డబుల్ చేసిన ఏకైక ప్రధాని మోడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎల్ఐసి డబ్బులు అదాని కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారని ఆరోపించారు.

ప్రజల డబ్బును ప్రైవేట్ కంపెనీ లో పెట్టడానికి మోడీ ఎవరు? అని నిలదీశారు. ప్రైవేట్ కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ వారు ఇచ్చిన డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మన సంక్షేమం కోసం డబ్బులు పంపిస్తుంటే.. మోడీ మన డబ్బులు తిరిగి తీసుకుంటున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news