‘నాలుగేళ్ల నరకం’ పేరిట టీడీపీ పోస్టర్లు..

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రచారాన్ని ప్రకటిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు, హింస పెరిగిపోతున్నాయని గణాంకాలతో రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ వీడియో ఎత్తిచూపింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేళ్ల నరకం’ ప్రచార కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతోంది. రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధానంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో సహా పోస్టర్లపై ముద్రించారు. గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ వంటి కీలక ప్రాంతాలలో ఈ పోస్టర్లు అంటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news