కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివారం.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న సందర్భంగా బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకున్న కార్యకర్తలు ఒక్కసారిగా ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలా అనొద్దని వారికి సైగ చేసినా ఆపకుండా ‘సీఎం బండి సంజయ్’ అంటూ నినాదాలు చేశారు.

Why BJP shunted out Bandi Sanjay Kumar in Telangana - Rediff.com

సోషల్ మీడియాలో తనకు లేదా కిషన్‌రెడ్డికి లేదా తమ పార్టీలోని ఇతర నాయకులకు వ్యతిరేకంగా చేస్తోన్న ప్రచారాన్ని దయచేసి ఆపివేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సందట్లో సడేమియాలా కొంతమంది ఇతర పార్టీల నాయకులు వీటి ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు.. పోయేది లేదని, వాటిని తామెవరం పట్టించుకోమన్నారు. ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిది కాదన్నారు. మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు సరికాదన్నారు. ఇక్కడ అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణలో రామరాజ్య పాలన తెచ్చే విధంగా పని చేద్దామన్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డికి తామంతా శిష్యులలాంటి వారమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news