నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్‌

-

మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వారికి పాలన చేతకాదని కొంతమంది ఎగతాళి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మనం కొత్తగా నిర్మిస్తోన్న ఆఫీసులే వారికి సమాధానమని సీఎం కేసీఆర్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలే సరిగ్గా లేవన్నారు సీఎం కేసీఆర్. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Telangana CM KCR slams Budget 2022, calls it 'golmaal' - India Today

ఒకప్పుడు కాలువలు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో మంజీరా నది దుమ్ము కొట్టుకు పోయిందని, తక్కువ కాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు సీఎం కేసీఆర్‌. పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పెన్షన్ రూ.4వేలకు పెంచుకున్నామని, రానున్న రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతితో మరింత పెంచుకుందామన్నారు. తెలంగాణ రాకముందు 24 లక్షల పెన్షన్లు వచ్చేవని, ఇప్పుడు రెండింతలు అయినట్లు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news