WORLD CUP 2023: పసికూనపై మోస్తరు విజయంతో బోణీ కొట్టిన శ్రీలంక… !

-

కాసేపటి క్రితమే ముగిసిన వరల్డ్ కప్ మ్యాచ్ లో శ్రీలంక నెదర్లాండ్ పై మరో ఓవర్ నాలుగు బంతులు మిగిలి ఉండగా అయిదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి టోర్నమెంట్ లో బోణీ కొట్టింది. వాస్తవంగా ఈ మ్యాచ్ ను లంకేయులు ఎప్పుడో ముగించాల్సింది.. క్నీ నెదర్లాండ్ శ్రీలంకకు చాలా గట్టి పోటీ ఇవ్వడంతో ఇంతవరకు వచ్చింది. నెదర్లాండ్ ఇచ్చిన 263 పరుగులు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో శ్రీలంక మొదట్లోనే పెరీరా వికెట్ను కోల్పోయింది… ఆ తర్వాత ఇన్నింగ్స్ ను స్టడీ చేసే బాధ్యతను మెండిస్ నిస్సంకలు తీసుకున్నారు. అయితే నెదర్లాండ్ బౌలర్లు పుంజుకుని మెండిస్ నిస్సంకలను అవుట్ చేసింది. కానీ సమరవీర (91) మరియు అసలంక(44) లు పరిస్థితులకు తగినట్లుగా ఆడి విజయాన్ని అందించారు. ఈ విజయంతో శ్రీలంక నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది.

ఇక నెదర్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకే విజయంతో ఎనిమిదవ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news