మల్లెసాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులు..

-

సమ్మర్ వచ్చిందంటే.. చెమట కంపే కాదు.. మల్లెపూల సువాసన కూడా వెదజల్లుతుంది. ఈ టైంలోనే మల్లెపూలు కోతకు వస్తాయి. స్టాక్ మార్కెట్ లెక్క మల్లెపూల రేటు స్థిరంగా ఉండదు.. పండగలు, పెళ్లిళ్లు లాంటివి ఉంటే.. ధర కొండెక్కుతుంది. లేదంటే.. కొన్ని సార్లు రూ. 50కే కేజీ పూలు వస్తాయి. ఇది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. ఏరియాను బట్టి కేజీ రూ. 300- 900 వరకూ ఉంది.. ఎన్ని పూల ఉన్నా.. మలె పూలు ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో మల్లెతోటల సాగు విరివిగా ఉంది. సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తారు..మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారా గానీ ప్రవర్ధనం చేయవచ్చు. మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. సాయంత్రం వేళ నాటుకోవడం మంచిది. మొక్కల మధ్య వరుసల మధ్య రెండు మీటర్ల గ్యాప్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం.. మల్లెలో లేత చిగుర్ల నుండే పూలు వస్తాయి. వీటి కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. కొమ్మ కత్తిరింపులకు 15 రోజుల ముందు నీరు కట్టడం ఆపేయాలి. కత్తిరింపుల తరువాత నీరు కట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి.

ఎరువులు..

మల్లె తోటలకు అందించాల్సిన ఎరువులల్లో.. పశువుల ఎరువుతో పాటు 120 గ్రా, నత్రజని ఎరువు, 120 గ్రా భాసర్వరం , పొటాష్, ఎరువులను కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఇవ్వాలి.

పూల దిగుబడి పెంచేందుకు లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌, 5.గ్రాముల మెగ్నీషియం, సల్ఫేట్‌ సూక్ష్మ ధాతువులను కలిపి రెండు, మూడు దఫాలుగా పిచికారీ చేయాలి.

మొక్కలు నాటిన ఆరు నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3 నుంచి 4 టన్నుల దిగుబడి పొందొచ్చు. కోతను కూడా.. ఉదయమే పూర్తయ్యేలా చూసుకోవాలి. లేదంటో పూలు వాడిపోయి మంచి ధర పలకదు.

Read more RELATED
Recommended to you

Latest news