పుచ్చకాయలను ఇలా సాగు చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..

-

వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే కాయలు మామిడి , దోస, పుచ్చకాయలు..మిగిలిన కాయల తో పోలిస్తే పుచ్చ కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వేసవిలో ఈ పంట వేస్తే లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పంట దిగుబడి బాగా రావాలంటే కొన్ని మెలుకువలు కూడా పాటించాలి. అప్పుడే మంచి లాభాలను కూడా పొందవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.. పుచ్చ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాము.

ముందుగా ఈ పుచ్చకాయలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి..ఇందులో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి అవి..

అసహి యమటో: జపనీస్ పరిచయం IARI, న్యూఢిల్లీ ద్వారా విడుదల చేయబడింది. పై తొక్క రంగు లేత ఆకుపచ్చ, చారలు లేని రకం. చూడటానికి సొరకాయ ఆకారంలో ఉంటుంది. సకాలంలో వేస్తే 95 రోజుల్లో 22 టన్నుల దిగుబడిని ఇస్తుందని అంటున్నారు.

మరో రకం..అర్క జ్యోతి: క్రింప్సన్ స్వీట్‌తో IIHR – 20ని దాటడం ద్వారా F1 హైబ్రిడ్. పండు నీలం కోణీయ స్టిర్పెస్‌తో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది..ఇది కూడా నేలను బట్టి మంచి దిగుబడిని ఇస్తుంది.

ఇక మూడో రకం..ఆర్కా మానిక్: F1 హైబ్రిడ్ IIHR – 21 మరియు క్రింప్సన్ స్వీట్. పండ్లు ముదురు ఆకుపచ్చ చారలతో ఆకుపచ్చగా ఉంటాయి..వీటిని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము.

నేల:

పుచ్చకాయ పంటను వేయడానికి భూసారం ఎక్కువగా ఉన్న నేల అవసరం అంటే, ఇసుక, ఒండ్రు మట్టి ఉన్న నేల అయితే పర్ఫెక్ట్..pH: 6.7 నుండి 7. జాబ్నర్ – 21, జాబ్నర్ 18-1 వంటి రకాలు అధిక pH నేలపై పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

వాతావరణం:

కాయలు బాగా సైజ్ రావాలంటే మంచి వేడి ఉండాలి.24 నుండి 270 C ఉష్ణోగ్రత అవసరం. నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేయడానికి పండిన సమయంలో అధిక ఉష్ణోగ్రత ఉండాలి.

విత్తనాలు వేసే సమయం:

ఉత్తర భారత దేశంలో ఫిబ్రవరి నుండి మార్చి వరకు విత్తుతారు.దక్షిణ, మధ్య భారతదేశంలో, ఇది డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుతారు.డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుతారు. రాజస్థాన్‌లో, వర్షాకాలం పంటను ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు విత్తనాలు.

విత్తనాలు వేయడం:

ఒక హెక్టారుకు 3 నుండి 5 కిలోలు సరిపోతాయి.. విత్తనాలు మొలిచిన తర్వాత చూసి మళ్ళీ పడకలు వెయ్యాలి.విత్తనానికి విత్తనానికి మధ్య దూరం చూసి వేయాలి.అలాగే వరుసల మధ్య 2.4 నుండి 4 మీ ఉండేలా చూసుకోవాలి.ఒక మొక్క నుంచి మొక్క మధ్య దూరం 60 నుంచి 120 సెం.మీ తప్పక ఉండాలి.

నీటి పారుదల:

నదీ జలాల దగ్గర ఉన్న తోటకు ఎక్కువ నీరు అవసరం లేదు.కానీ మామూలు నేలల్లో మాత్రం వారం లేదా పది రోజులకు ఒకసారి పెట్టడం మంచిది.లేదు అంటే డ్రిప్ ను ఉపయోగిస్తే బెస్ట్..

ఎరువులు:

పుచ్చకాయ పంటకు తెగుల్లు, పురుగులు పట్టడం కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే భూమి పరీక్షలు చేసిన తర్వాతే ఎరువులు వెయ్యాలి. విత్తనాలు వేయడానికి ముందు 15 నుండి 20 రోజుల ముందు హెక్టారుకు 15 నుండి 20 నుండి ఎఫ్‌వైఎం వేయాలి. దీన్ని మట్టిలో కలిసేలా చేస్తారు. వ్యవసాయ నిపునుల సలహా మేరకు ఎరువులను అడిగి నత్తజని, పోటాష్ ఎరువులను వెయ్యాలి.

కోతలు:

విత్తనాలు వేసిన మూడు నెలలకు కోతకు వస్తుంది..బాగా పండిన పుచ్చకాయను కొట్టినప్పుడు పగిలిన శబ్దం వినిపిస్తుంది.అప్పుడే కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయని. ఈ పద్దతుల ద్వారా విత్తనాలు వేస్తే సులువుగా 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది.పుచ్చకాయలు వారం పది రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు అందుకే త్వరగా మార్కెట్ చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news