ప్రభాస్ సినిమా పై సంచలన విషయాన్ని వెల్లడించిన దర్శకుడు నాగ అశ్విన్…!!

-

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం జాన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ తో పాటు ప్రభాస్ సొంత సంస్థైన గోపికృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక హృద్యమైన ప్రేమకథగా, పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు ఎంతో భారీగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్.

దాదాపుగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా అనౌన్సుమెంట్ కాసేపటి క్రితం రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వం లో ఆ సినిమా తెరకెక్కనుంది. గతంలో మహానటి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న అశ్విన్,

 

ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపించనున్నారో అంటూ అప్పుడే ఆయన ఫ్యాన్స్ ఆలోచనలు మొదలెట్టడంతో, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఆ సినిమా గురించి నాగ అశ్విన్ ఒక ట్వీట్ చేస్తూ తెలిపారు. ఈ ఏడాది ఎండింగ్ లో సినిమా ప్రారంభం అయి, వచ్చే ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేస్తాం అని, అలానే అందరూ అనుకుంటున్నట్లుగా ఇది పాన్ ఇండియా ఫిలిం కాదని, పాన్ వరల్డ్ ఫిలిం అని నాగ అశ్విన్ తన ట్వీట్ లో తెల్పడం జరిగింది. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కూడా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కనున్నట్లు టాక్…..!!

Read more RELATED
Recommended to you

Latest news