Acharya: ‘ఆచార్య’లో గురు-శిష్యులుగా చిరంజీవి, రామ్ చరణ్‌!

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ పిక్చర్ లో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లే చేశారు. ఈ మూవీ ట్రైలర్ మంగళవారం విడుదల కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మెగా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. వెండితెరపైన తమ అభిమాన హీరోలు తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగస్టార్ చిరుకు ఇది 152వ చిత్రం. కాగా, కొరటాల శివకు ఇది ఐదో పిక్చర్. ఇక ట్రైలర్ లో ఉన్న ఇంటెన్సిటీ, యాక్షన్ సీక్వెన్సెస్ , బీజీఎం నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ట్రైలర్ చివరలో తనికెళ్ల భరణి ‘ఆచార్య’ చిరును మీకు ‘సిద్ధ’ తెలుసా? అని అడిగినపుడు ‘కామ్రేడ్’ అంటూ రామ్ చరణ్ పిలుపు.. ఆ తర్వాత అడవిల్లో తండ్రీ తనయుల ఫైట్ సీన్స్ వెండితెరపైన చూసి అభిమానులు ఈలలు కొడుతున్నారు.

ఈ చిత్ర పోస్టర్స్ సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ ఆధారంగా తండ్రీ తనయలు ఇద్దరూ సాయుధ పోరాటం బాట పట్టినట్లు స్పష్టమవుతోంది. ఎర్ర జెండా మెడలో వేసుకున్న ‘ఆచార్య’ చిరు..బాటలో నక్సలైట్ గా ‘సిద్ధ’ అలియాస్ రామ్ చరణ్ సైతం అడుగులు వేస్తాడనిపిస్తోంది.

ఈ పిక్చర్ వర్కింగ్ స్టిల్స్ లో ఒక దానిని తాజాగా మేకర్స్ విడుదల చేయగా, అందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ తుపాకులు పట్టుకుని కొండగుట్టల్లో ఉన్నారు. దర్శకులు కొరటాల శివ యాక్షన్ చెప్పగానే వారిరువురు ఫైట్ సీన్ లోకి దిగుతున్నట్లు కనబడుతోంది. లవ్ స్టోరి, యాక్షన్, కొరటాల శివ సెన్సిబిలిటీస్ తో సినిమా డెఫినెట్ గా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుందని అభిమానులు అంటున్నారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news