Big Boss Non Stop: బిందు మాధవిపై రన్నరప్ అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ OTT టైటిల్ విన్నర్ గా ఆడపులి అలియాస్ బిందు మాధవి నిలిచింది. రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలిచారు. గతంలోనూ రన్నరప్ అయిన అఖిల్ ఈ సారి విన్నర్ అవుతారని అందరూ అనుకున్నారు. అందుకు చివరి వరకు అఖిల సార్థక్ ప్రయత్నాలు చేశారు. కానీ, ఈ సారి కూడా రన్నరప్ గానే నిలిచాడు.

ఇక బిందు మాధవి టైటిల్ విన్ అయిందని తెలుసుకున్నాక తాను ఓకే అని అనుకున్నానని చెప్పుకొచ్చారు అఖిల్.

తాను మొదటి నుంచి తన గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టానని, ఈ సారి గేమ్ లో తాను ఎటువంటి చిన్న మిస్టేక్స్ చేయలేదని వివరించాడు. అయితే, బిందు మాధవితో ఫ్రెండ్ షిప్ కోసం తాను మొదటి నుంచి ప్రయత్నిస్తున్నానని, చివరిలో ఆమెతో స్నేహం కుదిరిందన్నాడు.

తన దృష్టిలో తానే టైటిల్ విన్ అవుతానని అనుకున్నానని, బిందు మాధవి గురించి అస్సలు ఆలోచించలేదని తెలిపాడు. ఇకపోతే తనను సపోర్ట్ చేసిన శ్రీ రాపాక, తేజస్వి మడివాడ తన దృష్టిలో బెస్ట్ కంటెస్టెంట్స్ అని వివరించాడు అఖిల్ సార్థక్.

Read more RELATED
Recommended to you

Latest news