జబర్దస్త్ కి అనసూయ ను మించి మరో హాట్ యాంకర్..!!

-

అనసూయ.. గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ ఈ షో తోనే ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకోవడంతో పాటు తన అంద చందాలతో కుర్రకారు గుండెల్లో మంట పెడుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉండే ఈమె తన వస్త్రధారణ పై ఎవరైనా కామెంట్లు చేశారు అంటే వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.

తాజాగా జబర్దస్త్ నుంచి ప్రముఖ హీరోయిన్ రోజా తప్పుకోవడంతో ఆ తర్వాత సుధీర్, ఆదితోపాటు మరికొంతమంది కమెడియన్లు కూడా జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు. ఇక ఈ క్రమంలోనే హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పినట్లు సమాచారం. అసలే ఈ షో కి టీఆర్పి రేటింగ్ పడిపోయింది .. ఇక ఈ అందాల తార కూడా వెళ్ళిపోతే ఇక ఎవరు చూస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే అనసూయ ఒక నోట్ రాసి పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ పోస్టు ద్వారా ఆమె జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే అనసూయ స్థానంలో జబర్దస్త్ కి అలనాటి అందాల తార.. తన అందంతో మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రముఖ స్టార్ యాంకర్ మంజూష రాంపల్లి ని తీసుకువస్తున్నట్లు సమాచారం. యాంకరింగ్ లో మంచి అనుభవం ఉన్న మంజూష ఈ మధ్యకాలంలో గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే అనసూయ స్థానంలో మంజూషకి ఆ స్థానం కల్పిస్తూ జబర్దస్త్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి అనసూయ లాగా మంజూష ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news