భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చుంటే మంచిదో తెలుసా?

-

మన భారత దేశంలో ప్రతిధీ సాంప్రదాయం ప్రకారం చేస్తాము.. కూర్చోనే దగ్గర నుంచి, పడుకోనే వరకూ అన్నీ ఒక పద్దతిగా చేస్తారు..భోజనం విషయానికొస్తే.. ఉదయం అల్పాహారం తీసుకుంటే మిగిలిన రెండు పూటలు భోజనం చేస్తారు.అయితే ప్రతి రోజు రెండు సార్లు భోజనము చేయాలని తైత్తిరియ బ్రాహ్మణం చెప్తోంది. రెండు సార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుందట.

 

 

 

 

భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుందని కూడా తైత్తిరియ బ్రాహ్మణం వివరిస్తోంది. అలాగే దక్షిణ దిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున కూర్చని భోజనం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి..అందుకే ఎక్కువ మంది తూర్పు దిక్కున కూర్చోని భోజనం చేస్తారు.

అలాగే ఆకులు, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బుని ఆశించే వాడు మట్టి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందూ, తర్వాత ఆచమనం చెయ్యాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. కానీ నియమాలను అనుసరించి కాకుండా ఎలా పడితే అలా తింటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్య, ఆర్థిక సమస్యలు రావొచ్చు… తినేటప్పుడు అన్నా పద్దతిగా తింటే బెస్ట్ కదా..

Read more RELATED
Recommended to you

Latest news