బోయ‌పాటికి బాల‌కృష్ణ వార్నింగ్‌..?

-

బోయ‌పాటి శ్రీను సినిమాల్లో కంటెంట్ కంటే క‌మ‌ర్షియల్ అంశాల హ‌డావుడినే భారీగా ఉంటుంది. అయితే కెరీర్ బిగినింగ్‌లో భద్ర‌, తుల‌సి, సింహా, లెజెండ్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. స‌రైనోడు బ‌న్నీఇమేజ్‌తో లాక్కొచ్చేసింది. ఎలాగోలా స‌క్సెస్ తీరం చేరింది. కానీ ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీసు వ‌ద్ద ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకుంటున్నాయి. ద‌మ్ము, జ‌య‌జాన‌కి నాయ‌క‌, విన‌య విధేయ రామ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి.

వీటిలో భారీ హంగులు త‌ప్ప కంటెంట్ లేద‌నే కామెంట్ క్రిటిక్స్ నుంచి వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌కృష్ణ‌కి హ్యాట్రిక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ సింహ‌, లెజెంట్ సూప‌ర్ హిట్స్ గా నిలిచిన విష‌యం అంద‌రికి తెలుసు. స‌క్సెస్ కోసం బాల‌కృష్ణ‌ని బోయ‌పాటి న‌మ్ముకుంటే, బోయ‌పాటి పైనే బాల‌కృష్ణ కూడా చాలా ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నార‌ట‌. ఎందుకంటే పైసావ‌సూల్‌, జై సింహ‌, ఎన్టీఆర్ చిత్రాలు వ‌రుస‌గా బోల్తా కొట్టాయి. అర్జెంట్‌గా ఆయ‌న‌కో హిట్ కావాలి. అదే స‌మ‌యంలో బోయ‌పాటికి ఓ వార్నింగ్ కూడా బాల‌కృష్ణ నుంచి వెళ్ళింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో కోడై కూస్తోంది.

సాధార‌ణంగా బోయ‌పాటి హీరో మార్కెట్‌ని మించి బ‌డ్జెట్ పెడుతుంటారు. దీని వ‌ల్ల జ‌య‌జాన‌కి నాయ‌క‌, విన‌య విధ‌య రామ నిర్మాత‌లు దారుణంగా న‌ష్టాల‌ను చ‌వి చూశారు. త‌న సినిమాకి కూడా అలాంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌ని, బ‌డ్జెట్ త‌గ్గించ‌మ‌ని బాల‌కృష్ణ గ‌ట్టిగానే చెప్పార‌ట‌. దీంతో బోయ‌పాటి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. అందుకు అనుగునంగా ఇప్పుడు త‌న స్ర్కిప్టులో మార్ప‌లు చేసే ప‌నిలో బోయ‌పాటి బిజీగా ఉన్న‌ట్టు టాక్‌. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్టు మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. దీని కంటే ముందు జైసింహా ఫేమ్ కె.ఎస్‌.ర‌వికుమార్‌తో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌నున్నారు. ఇది ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఇక బోయ‌పాటి చివ‌ర‌గా రామ్‌చ‌ర‌ణ్ హీరోగా విన‌య విధేయ రామ‌ని రూపొందించిన విష‌యం విదిత‌మే. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుద‌లై పూర్తిగా డిజప్పాయింట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news