Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో కాజ‌ల్ కూతురు సంద‌డి!

-

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుతోంది. టైటిల్ రేసులో కంటెస్టెంట్లం ద‌రూ హోరాహోరీగా పోటీ ప‌డుతున్నారు. దీంతో సీజ‌న్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నియంత మాటే శాసనం గేమ్‏లో రవి.. షణ్ముఖ్, ప్రియాంక మిగలగా.. షణ్ముఖ్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. దీంతో బిగ్‏బాస్ ఇంటికి కెప్టెన్‏గా షణ్ముఖ్ ఎన్నికయ్యాడు.

ఇదిలా ఉంటే.. కంటెస్టెంట్ల కుటుంబీకుల‌ను హౌస్‌లోకి పంప‌బోతున్నారు బిగ్ బాస్. గ‌త సీజ‌న్స్‌లో క‌రోనా తీవ్ర‌త ఉండ‌టంతో గ్లాస్ చాంబ‌ర్‌లో ఉంచి మాట్లాడించేవారు . కానీ, ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గింది కాబ‌ట్టి.. వారిని క్వారంటైన్‌లో ఉంచి.. డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపిస్తున్నారు.

ఇక‌, హౌస్ లో బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ న‌డుస్తున్నది. ఈ టాస్క్ లో భాగంగా.. రైలు గేమ్ ఆడించాడు బిగ్‏బాస్. చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్స్ బోగీలా మారడంతోపాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఆ మధ్య‌లో పాస్ చేయ‌డం, ర‌న్ అన‌డం చేస్తున్న‌టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ చాలా స‌రాదాగా సాగింది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్ల అంద‌రినీ పాజ్ చేసి.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. కాజల్ భర్త.. కూతురును హౌస్ లోకి పంపించారు బిగ్‏బాస్. తన తల్లి కాజల్‌ని చూడగానే ఆమె కూతురు మమ్మీ అంటూ పరుగెత్తుకు రావ‌డంతో కాజ‌ల్ ఆనందానికి ఆవ‌ధుల్లేకుండా పోయాయి. కండ్లు చెమ్మగాలాయి. చాలా ఎమోష‌నల్ అయ్యింది.

నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని మ‌మ్మీ అని కూతురు అనడంతో కాజల్‌ నవ్వేసింది. చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఆ త‌రువాత శ్రీ రామ్ , కాజ‌ల్ కూతురికి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ జ‌రిగింది. మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపం వస్తాదా అని శ్రీరామ్ ప్ర‌శ్నించగా.. అవునంటూ తలుపింది కాజల్ కూతురు. ఆనీ మాస్ట‌ర్‌పై చాలా సార్లు కోపం వ‌చ్చింది. ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. కాజ‌ల్ త‌న భ‌ర్త‌, కూతురితో స‌ర‌దాగా గ‌డిపాక వారిద్ద‌రిని బ‌య‌ట‌కు పంపారు. ఇక ఈ రోజు శ్రీరామ్ సోద‌రి, మాన‌స్ త‌ల్లి రాబోతున్నారట‌ .

Read more RELATED
Recommended to you

Latest news