కరోనా వైరస్ పై ఛార్మి సంచలన పోస్ట్…..సోషల్ మీడియాలో న్యూస్ వైరల్…..!!

-

తెలుగు సినిమా పరిశ్రమకు నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ఆ క్రమంలో పలు ఇతర భాషల్లో కూడా నటించిన ఛార్మి, తెలుగుతో పాటు ఆయా భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. ఒక ఒకానొక సమయంలో మంత్ర మూవీతో మంచి పాపులరైన ఆమె, ఆ తరువాత కొన్నాళ్ళకు పూరి జగన్నాథ్ తీసిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారింది. ఆ సినిమాలో తానే నటిస్తూ నిర్మించిన ఛార్మి, అక్కడి నుండి పూరి జగన్నాథ్ తీస్తున్న ప్రతి సినిమాకు హ నిర్మాతగా వ్యహరిస్తూ ముందుకు సాగుతోంది.

ఇక ప్రస్తుతం విజయ్, పూరి ల కలయికలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ కు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మికి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పోస్టులు పెట్టడం అలవాటు. ఇకపోతే నిన్న రాత్రి కరోనా వైరస్ పై ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఎంతో వైరల్ అవడంతో పాటు నెటిజన్లు ఆమెపై ఆగ్రహావేశాలకు గురిచేసింది. విషయం ఏమిటంటే, కరోనా వైరల్ పలు దేశాలు దాటి మొత్తానికి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ కు చేరిందట. ఇక్కడా తొలి కరోనా కేసు నమోదు అయిందట, ఆల్ ది బెస్ట్ అంటూ ఛార్మి ఒక టిక్ టాక్ వీడియో చేస్తూ దానిని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

 

ఓవైపు ప్రజలు ఆ మహమ్మారి వైరస్ తో వణికిపోతుంటే నీకు సరదాగా ఉందా అంటూ పలువురు ప్రజలు ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్స్ పెట్టడంతో, ఒక్కసారిగా అలర్ట్ అయిన ఛార్మి, వెంటనే దానిని డిలీట్ చేసింది. ఇక అప్పటికే నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఫైర్‌ అవ్వడంతో ఆమె మరొక ట్వీట్ చేస్తూ, నేను ఇలాంటి సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్‌ చేయకుండా ఉండాల్సింది. మీరు చేసిన కామెంట్స్‌ నేను చదివాను, నిజానికి ఇది చాలా సున్నితమైన అంశం అని నేను భావించలేకపోయాను. ఈ తప్పు చర్య పట్ల నేను అందరినీ క్షమాపణలు కోరుతున్నాను, అలానే ఇకపై భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయను అంటూ ఆమె మరొక పోస్ట్ చేసింది. ….. !!

Read more RELATED
Recommended to you

Latest news