పవన్ కళ్యాణ్ కోసం అలాంటి పనికి పూనుకున్న చిరంజీవి..!

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలో సక్సెస్ కావాలని అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత తెలంగాణ విభజన జరగడంతో రాజకీయాలకు విరామం ప్రకటించి మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీ కష్టాలను ఒక పెద్ద మనిషిగా పట్టించుకుంటూ సినీ కార్మికుల బాగోగులను చూసుకుంటూ కరోనా సమయంలో కూడా అనేక విధాలుగా సహాయపడి.. తన పాత్రను సినిమాల వరకే పరిమితం చేస్తూ వస్తున్నారు.

మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చినా సరే అవన్నింటిని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ఆయనకు అనేక రకాలుగా సర్ది చెప్పిన సరే ఆయన రాజకీయాలలోకి రావడానికి ఒప్పుకోలేదు. అయితే చాలాకాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయ ఎంట్రీ చేస్తున్నారా.. అన్న ఆలోచనను కలిగిస్తోంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు.

రాజకీయం అనే పద్మవ్యూహంలో అభిమన్యుడు లాగా ఒంటరి పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి మద్దతుగా నిలబడితే బాగుంటుంది అని జన సైనికులు కోరుకుంటున్నా సరే మౌనం వీడని చిరంజీవి.. ఇప్పుడు పవన్ పై జరుగుతున్న ప్రతి విషయానికి తీవ్ర మనస్థాపానికి చెందినట్లు తెలుస్తోంది. అందుకే తమ్ముడిని అలా ఒంటరిగా వదిలేయలేక తమ్ముడి కోసం అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ సమాచారం. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో ఆంధ్ర మంత్రులను ఆయన టార్గెట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకరకంగా జనసేనకు ఇది శుభ సూచకం అంటూ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే చిరంజీవి కోసం పెద్ద తలకాయలన్నీ జనసేనకు మద్దతుగా రంగంలోకి దిగుతాయని, అప్పుడు పవన్ కళ్యాణ్ కు మరింత సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి చిరంజీవిగా అండగా నిలిచి తమ్ముడిని ఏ విధంగా రాజకీయాలలో సక్సెస్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version