సంక్రాంతి కి ఇన్ని సినిమాలు ఉన్నా ధమాకా విజ్రంబిస్తోంది..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా  విడుదల అయిన సినిమాను మినిమం గ్యారెంటీ ఉంటుంది.అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , విజయ్, అజిత్, విజయ్ అందరూ  సంక్రాంతి బరిలో దిగారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య  సినిమా  సంక్రాంతి  పండుగ సందర్భంగా 13 న రిలీజ్  అయ్యి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా , ఒక రోజు ముందుగానే అంటే జనవరి 12వ తేదీ న విడుదల అయ్యి బాగానే వసూళ్ళు రాబట్టుతోంది. ఇక దిల్ రాజు నిర్మించిన విజయ్ వారసుడు సినిమా, అలాగే అజిత్ సినిమా తెగింపు ఆకట్టుకోలేదు. ఇక యంగ్ హీరో సంతోష్ శోబన్ కళ్యాణం కమనీయం కు  కూడా అంతగా టాక్ లేదు.

ఇక ఇదే సమయంలో రవితేజ సినిమా మళ్లీ థియేటర్ లో దుమ్ము దులుపుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ  కూడా ధమాకా ఇంకా హౌస్ ఫుల్స్ అవుతూ ఉండడం విశేషం అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధమాకా కొన్ని థియేటర్స్ లోనే ప్రదర్శితం అవుతున్నప్పటికీ వాటిలో కూడా ఆల్ మోస్ట్ ఈ పండుగలో హౌస్ ఫుల్స్ పడ్డాయని ట్రేడ్ టాక్ గట్టిగా నడుస్తోంది. చాలా రోజుల తర్వాత రవితేజ అమేజింగ్ హిట్ కొట్టాడని ఫ్యాన్స్ సంబరం గా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news