ఆ చిత్రంతో భారీగా నష్టపోయిన దిల్ రాజు..

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రజెంట్ ప్రెస్టీజియస్ అండే క్రేజీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రాజు తన 50వ సినిమాను ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నారు. ఈ భారీ చిత్రం కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఓ చిత్రం వలన దిల్ రాజుకు భారీ నష్టం వచ్చింది. ఈ విషయం స్వయంగా దిల్ రాజుయే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ చిత్రం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్ రాజు ఓ వైపున తన సొంత బ్యానర్ లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూనే మరో వైపున కొన్ని సినిమాలను ఇతర సంస్థలతో కలిసి కో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. అలా దిల్ రాజు తన బంధువు అయిన నిరంజన్ రెడ్డితో కలిసి తీసిన ‘మరో చరిత్ర’ ఫిల్మ్ వలన భారీ నష్టం వచ్చింది. అప్పటికే తన బ్యానర్ లో వరుణ్ సందేశ్ తో ‘కొత్త బంగారు లోకం’ పిక్చర్ తీసిన దిల్ రాజు.. ‘మరో చరిత్ర’ కు కూడా ఓకే చెప్పేశారు.

‘మరో చరిత్ర’ కోసం బడ్జెట్ ను తొలుత రూ.5 కోట్లుగా ఫిక్స్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. అలా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే, అమెరికాకు వీసాలు రాలేదు. దాంతో కొంత మందితో షూటింగ్ స్టార్ట్ చేశారు. చాలా రోజులు అవుతున్నప్పటికీ వీసాలు రాకవపోవడంతో నెక్స్ట్ ఆప్షన్ గా దుబాయ్ కు వెళ్లారు. అక్కడ షూటింగ్ మళ్లీ చేసేశారు. అలా సినిమా బడ్జెట్ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు చేరింది.

అలా ‘మరో చరిత్ర’ వలన ఫైనాన్షియల్ డ్యామేజ్ భారీ గా జరిగిందని దిల్ రాజు తెలిపారు. మొత్తంగా సినిమాకు భారీ నష్టమే జరిగింది. అయితే, తర్వాత వచ్చిన సినిమాల వలన నష్టం భర్తీ అయిందని దిల్ రాజు వివరించారు. నిరంజన్ రెడ్డితో కలిసి దిల్ రాజు తీసిన మరో సినిమా ‘గగనం’ వలన ఆర్థికంగా నష్టమేమీ జరగలేదని దిల్ రాజు తెలిపారు. ‘మరో చరిత్ర’ వంటి క్లాసికల్ ఫిల్మ్ ను టచ్ చేయకుండా ఉండాల్సిందని తెలిపారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news