ఆ విషయంలో బాధపడుతున్నా.. దర్శకుడు శ్రీను వైట్ల

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ..సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘దూకుడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మహేశ్ అభిమానులు ఈ ఫిల్మ్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇప్పటికీ ఈ పిక్చర్ టీవీల్లో వస్తే చాలు..జనాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తో పాటు స్టోరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్, కామెడీ ఇలా అన్నీ అంశాలను సమపాళ్లలో పెట్టి చక్కటి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు దర్శకుడు శ్రీను వైట్ల.

ఈ ‘దూకుడు’ సినిమా మేకింగ్ లోనూ తాను చాలా ఎంజాయ్ చేశానని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. కానీ, ఈ సినిమా తర్వాత జరిగిన పరిణామాల్లో తాను ఒకే ఒక్క విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నానని దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘దూకుడు’ ఫిల్మ్ సూపర్ హిట్ అయిన క్రమంలో ప్రతీ ఒక్కరు తనను అప్రిషియేట్ చేశారని వివరించారు శ్రీను వైట్ల.

‘దూకుడు’ రిలీజ్ తర్వాత తాను ఒక ప్రదేశానికి వెళ్లగా అక్కడ తనకు కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ కలిశారని, ఆయన తనను ‘దూకుడు’ను తమిళ్ లో రీమేక్ చేయాలని అడిగారని తెలిపారు. తనకు పిక్చర్ చాలా బాగా నచ్చిందని, హీరో రోల్ చాలా డిఫరెంట్ గా ఉందని అజిత్ కుమార్ తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు శ్రీను వైట్ల.

మీరు చేస్తానంటే తాను తమిళ్ లో ఈ సినిమా రీమేక్ చేస్తానని అజిత్ కుమార్ చెప్పారని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. అయితే, తనకు తమిళ్ భాషపైన అంత గ్రిప్ లేదని దాంతో తాను ఏమీ చెప్పలేకపోయానని శ్రీను వైట్ల వివరించారు. అయితే, ఆ మూవీని ఎలాగో అలాగా తమిళ్ లో తానే రీమేక్ చేయాల్సిందని ఇప్పటికీ రిగ్రెట్ ఫీలవుతానని శ్రీను వైట్ల చెప్పారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల ..మంచు విష్ణుతో ‘ఢీ’కి సీక్వెల్ ‘ఢీ అండ్ ఢీ’ తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news