పనిమనిషి వేతనం అన్ని లక్షలా..? కరీనానా మజాకా..!

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కరీనా కపూర్..సైఫ్ అలీ ఖాన్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. కరీనా మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన కరీనా..ఓ వైపున తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే..మరో వైపున సినిమాల్లో నూ నటిస్తోంది. ఈమె నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ త్వరలో విడుదల కానుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించారు.

సైఫ్ అలీ ఖాన్ తో పాటు కరీనా కపూర్ కూడా సినిమాలు చేస్తున్న క్రమంలో..వారి తనయులను చూసుకునేందుకు వారికి అంతగా టైమ్ ఉండబోదు. ఈ క్రమంలోనే పిల్లల ఆలనా పాలనా కేర్ టేకర్ చూసుకుంటున్నది. ఆమె ఎవరంటే..సావిత్రి. పిల్లలకు కావాల్సినవన్నీ ఇవ్వడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకుంటుందట.

ఇకపోతే ఈ పని చేస్తున్నందుకు ఆమెకు వేతనం రూ.15 లక్షలని బీ టౌన్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కూడా ఇంత వేతనం ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. సావిత్రి వెరీ లక్కీ అని అంటున్నారు. అయితే, కరీనా అంతేనని తన డబ్బును తన కుటుంబం కోసం ఖర్చు చేస్తున్నదని, ముఖ్యంగా తన తనయుల కోసం అంత ఖర్చు పెడుతున్నదని అంటున్నారు మరి కొందరు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news