పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జల్సా’ రీ-రిలీజ్ టైమ్ ఫిక్స్

-

ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ పిక్చర్స్ ‘ఒక్కడు’, ‘పోకిరి’లను పలు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రాలను మహేశ్ అభిమానులు, సినీ లవర్స్ చూసి ఆనందించారు. ఓ థియేటర్ లో హీరోయిన్ భూమికి ఈ ఫిల్మ్ ను అభిమానులతో కలిసి చూసింది.

రీ రిలీజ్ లోనూ మహేశ్ చిత్రాలు రికార్డు వసూళ్లు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ‘జల్సా’ను రిలీజ్ చేయబోతున్నారు.

ఇందుకు కొత్త ప్రింట్ రెడీ చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రచయిత సాయి రాజేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయం తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కొత్త ప్రింట్ లో పవర్ స్టార్ చాలా కొత్తగా కనిపిస్తారని రాజేశ్ పేర్కొన్నారు. 14 ఏళ్ల కిందట విడుదలైన ‘జల్సా’ను రీ -రిలీజ్ చేయడం గురించి తెలుసుకుని పవన్ కల్యాణ్ అశేష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అని పవర్ స్టార్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు కూడా చేస్తు్న్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రజెంట్ పాలిటిక్స్, మూవీస్ రెండూ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ త్వరలో కంప్లీట్ చేసుకుని పవన్ కల్యాణ్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ పిక్చర్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news