బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ టాలీవుడ్ లో బాలకృష్ణ ని టార్గెట్ చేసిన నెటిజెన్స్ ..!

-

కరోనా మహమ్మారితో యావత్ భారతదేం అతలాకుతలం అవడం తో ఈ మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న ప్రముఖ సినీ తారలు పలువురు విరాళాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాతిక కోట్లు విరాళంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించాడు. దీంతో బాలీవుడ్ మొత్తం అవాక్కవడమే కాదు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే విషయం లో కొందరు ఇతర హీరోలపై ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు.

 

 

ప్రముఖ హీరోలంటూ.. సూపర్ స్టార్ అంటూ దేశమంతటా గొప్పలు పోతున్న కొందరు హీరోలు ఇప్పటి వరకు కరోనా విపత్తు నేపథ్యంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంతవరకు స్పందించలేదు. దాంతో ఈ బాలీవుడ్ బాద్ షా ని బాగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా.. వ్యాపారవేత్తగా.. నిర్మాతగా ఇలా వివిధ రంగాలలో వందల వేల కోట్లను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కరోనా విపత్తుకు తన సాయం అందించడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ తరహా కామెంట్స్ ఎదుర్కొంటున్న వాళ్ళలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తర్వాత టాలీవుడ్ లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఉండటం ఆసక్తికరం. నందమూరి నట సింహం బాలకృష్ణ కేవలం సినిమా హీరో కాదు… నందమూరి అనే పెద్ద కుటుంబానికి ప్రతినిధి. అంతే కాదు, ఓ నియోజకవర్గానికి ప్రతినిధి. శాసనసభ్యుడు. సినీ హీరోగా, రాయకీయ నాయకుడిగా జనాలలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన సినిమా రిలీజవుతుందంటే నందమూరి ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే రాజకీయ నాయకుడిగా జనాలలోకి వస్తే కూడా ప్రజలు ఆయన మీద చూపించే అభిమానం ఎంతగా ఉంటుందో ప్రతీసారి తెలుస్తూనే ఉంటుంది. అలాంటి ప్రజల కోసం బాలయ్య మాత్రం స్పందించడం లేదని చలించడం లేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news