వావ్..ఒకే ఫ్రేమ్‌లో ప్రియాంక, కృతిశెట్టి, కల్యాణి ప్రియదర్శన్, సాయిపల్లవి

-

జనరల్‌గా సినీ అభిమానులను తమ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అని అడిగితే అందరూ అని చెప్తుండటం మనం చూడొచ్చు. ఒక్కసారి తమ అభిమాన కథానాయికను చూస్తే చాలు..అని అనుకుంటుంటారు. కాగా, ఒకే ఫ్రేమ్ లో తమ అభిమాన తారలందరినీ చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అందుకు అవకాశం కల్పించింది బ్యూటిఫుల్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్.

ట్విట్టర్ వేదికగా ఓ సూపర్బ్ ఫొటోను ట్వీట్ చేసింది ఈ భామ. సదరు ఫొటోలో ఒకే ఫ్రేమ్ లో హీరోయిన్స్ వరుసగా ఉన్నారు. ఈ ఫొటో చూస్తుంటే తారలు అభిమానుల కోసంది దిగి వచ్చారన్నట్లుగా ఉంది. ఈ ఒక్క ఫొటో చాలు.. అనే క్యాప్షన్ తో కల్యాణి ప్రియదర్శన్ ఈ ఫొటోను షేర్ చేసింది. బిహైండ్ వుడ్ మెడల్స్ ప్రోగ్రామ్ లో ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది.

ఈ సెల్ఫీని బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ తీయగా, ఇందులో కల్యాణి ప్రియదర్శన్, కృతిశెట్టి, సాయిపల్లవి ఉన్నారు. అలా వారందరూ కెమెరా వైపునకు చూస్తూ ఉండగా ఫొటో క్లిక్ మనిపించింది ప్రియాంక. ఈ నలుగురు హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వీరు నటించిన సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news