సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపిన మహేష్ బాబు

-

విజయవాడ : సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపారు హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణా నదిలో కలిపి హీరో మహేష్ బాబు, కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు.

ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మ నిలయం వద్ద సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నిమజ్జనం చేశారు హీరో మహేష్ బాబు, కుటుంబ సభ్యులు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేష్ బాబు, కుటుంబసభ్యులు. అనంతరం గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారు హీరో మహేష్ బాబు, కుటుంబ సభ్యులు. కాగా సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఇక బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులందరూ ఆయ పార్థివ దేహానికి నివాళులు అర్పించి… కన్నీటి వీడ్కోలు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version