ముఖ్యమంత్రితో ‘మేజర్’ టీమ్..

-

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పిక్చర్ ను దేశవ్యాప్తంగా సినీ అభిమానులు చూసి ఇన్ స్పైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీలో చేరాలనుకునే వారికి మద్దతు ఇవ్వడంతో పాటు వారికి సాయం చేస్తామని ఇటీవల అడివి శేష్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన..మేజర్ టీమ్..తాజాగా యూపీ(ఉత్తరప్రదేశ్) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను కలిశారు.

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబ సభ్యులతో పాటు మేజర్ మూవీ యూనిట్ సభ్యులు..యూపీ సీఎంను ఆయన చాంబర్ లో కలిశారు. మూవీ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ సభ్యులను యూపీ సీఎం అభినందించారు. దేశభక్తిని పెంపొందించే చక్కటి సినిమా తీసిన దర్శకుడు, హీరో మూవీ యూనిట్ సభ్యులందరిని ప్రశంసించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news