మారుతితో మహానుభావుడు..!

-

2018 చివర్లో యువ హీరో శర్వానంద్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన పడి పడి లేచె మనసు మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా 7 కోట్ల వసూళ్లనే రాబట్టింది అంటే సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలాఉంటే శర్వానంద్ కెరియర్ లో మహానుభావుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మారుతి మరోసారి అతనితో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట. మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. లాస్ట్ ఇయర్ నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేసిన మారుతి అల్లు అర్జున్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేశాడు కాని అది వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా మళ్లీ శర్వానంద్ తోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. సుధీర్ వర్మ సినిమా పూర్తి కాగానే శర్వానంద్ మారుతి సినిమానే చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి మహానుభావుడు తర్వాత ఈ ఇద్దరు కలిసి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news