తనపై జరిగిన విష ప్రయోగం పై నోరు విప్పిన మెగాస్టార్..!

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాతో మెగా మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాను జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్న చిరంజీవి.. మీడియాతో మాట్లాడుతూ .. ఎన్నో విషయాల గురించి ఓపెన్ అయ్యారు. అంతేకాదు గతంలో తనపై జరిగిన విష ప్రయోగం గురించి కూడా నోరు విప్పారు.

మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతుండగా తనపై విషప్రయోగం జరిగిందని తెలిపిన చిరంజీవి అప్పట్లో ఒక పిచ్చి అభిమాని చేసిన పని ఇది అంటూ అందుకు సంబంధించిన రహస్యాలు కూడా వెల్లడించారు. కేరళలో వశీకరణ మందు తీసుకొచ్చి కేక్ లో కలిపి తనకు తినిపించారని చిరంజీవి వెల్లడించారు. మరణ మృదంగం సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది అభిమానులు తనతో కేక్ కట్ చేయించారని.. బలవంతంగా ఒక అభిమాని ఆ కేక్ ముక్క నోట్లో పెట్టగా కాస్త చేదుగా అనిపించడంతో డౌట్ వచ్చి టెస్ట్ కి పంపించామని.. ఆ రిపోర్టులో కేక్ లో వాడిన పౌడర్ లో పాయిజన్ వాడారని తెలిసిందని చిరంజీవి తెలిపారు.

అంతేకాదు వెంటనే నిర్మాత కె ఎస్ రామారావు గారు ఆ కేక్ తినిపించిన అభిమానిని కూడా కొట్టారు అని చిరంజీవి తెలిపారు.. ఎందుకిలా చేశావురా అంటే.. చిరంజీవి గారు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు.. వేరే వాళ్ళతో ఇంట్రాక్ట్ కావడం నచ్చలేదు.. ఆయనకు దగ్గర అవ్వాలని ఇలా చేశానని సదరు వ్యక్తి చెప్పినట్లు పేర్కొన్నారు.. ఇకపోతే ఈ విషయంపై స్పందించిన చిరంజీవి …పాపం వాడిది అభిమానం అనుకోవాలో.. లేక మూర్ఖత్వం అనుకోవాలో..వాడు మాత్రం అభిమానంతోనే అలా చేశాడనుకొని వదిలేసామని చిరంజీవి తెలిపారు. మొత్తానికైతే ఆనాటి సంగతులను పంచుకున్న చిరంజీవి.. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news