నాగశౌర్య పెళ్లిలో నోరూరిస్తున్న విందు ఏర్పాట్లు.. వీడియో వైరల్..!

-

ఎట్టకేలకు యంగ్ హీరో నాగ శౌర్య నిన్న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నాగశౌర్య సాంప్రదాయ పట్టు పంచె కట్టు లో మెరిసిపోగా.. వధువు ఎరుపు , బంగారు వర్ణం పట్టు చీరలు స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా నాగశౌర్య పెళ్లిలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ అయితే వీరి పెళ్లి వేడుకలలో ఏర్పాటుచేసిన విందు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పెళ్లికి వచ్చిన అతిథులందరికీ కూడా రాచరికపు స్థాయిలో భోజనాలు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

నాగశౌర్య పెళ్లి వేడుకలలో ఏర్పాటు చేసిన విందు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. సాంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిధికి ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు , నాలుగు రకాల స్వీట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో సెలబ్రిటీల కోసం త్వరలోనే హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి అంతకుముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ , మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలలో నాగశౌర్య తన భార్యతో కలిసి డాన్స్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా అందరిని బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా పెళ్లిలో పట్టు వస్త్రాలతో కనిపించి అందరికి కనువిందు చేసిన నాగశౌర్య ఇలా భోజనం విషయంలో కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉండగా ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్ అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news