ప్ర‌భాస్ కోసం మైత్రి మూవీ మేక‌ర్స్.. ఊహ‌కంద‌ని క‌థ‌తో సినిమా

-

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాదుకాదు.. నేష‌న‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మ‌న డార్లింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపోయాడు క‌దా. అన్ని భాష‌ల్లో ఆయ‌న‌కు ఇప్పుడు అభిమానులు ఉన్నారు. ఏ సినిమా తీసినా అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని తీయాలి కాబ‌ట్టి ఇప్పుడు అంద‌రు డైరెక్ట‌ర్లు అలాగే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇక డార్లింగ్ ఇప్పుడు రాధేశ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం కొవిడ్ కార‌ణంగా ఈ సినిమాల షూటింగులు వాయిదా ప‌డ్డాయి. దాంతో ప్ర‌భాస్‌కు రెస్ట్ దొరికింది.

అయితే దొరికిన ఈ రెస్ట్‌లో మైత్రీ మూవీమేక‌ర్స్ ఓ సెన్సేష‌న‌ల్ ప్రాజెక్టుతో ప్ర‌భాస్ ముందుకు వ‌చ్చారు. డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహసం లాంటి కొత్త త‌ర‌హా క‌థ‌తో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసిన యేలేటితో మ‌రో కొత్త క‌థ‌ను రాయిస్తున్నారు. ఈ క‌థ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌భాస్ దీనికి ఓకే చెబితే మాత్రం ఫ్యాన్స్‌కు మ‌రో గిఫ్ట్ ఇచ్చిన‌ట్టే.

Read more RELATED
Recommended to you

Latest news