మాల్వీ మల్హొత్ర కారణంగా రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలనుకుంటున్నాడు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు

-

మాల్వీ మల్హొత్ర కారణంగా రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలనుకుంటున్నాడు అని లావణ్య సంచలన  వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. నాకు పోలీసులు న్యాయం చేశారని.. ధర్మమే గెలిచిందని పేర్కొంది. కొందరూ తనను విడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్ మాల్వీ మల్హొత్రతోనే ఉంటున్నాడు. ఉద్దేశ్యపూర్వకంగానే నన్ను డ్రగ్స్ లో ఇరికించారు.

ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నట్టయితే.. రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టే. మేమిద్దరం కలిసి దాదాపు 11 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాం. మరోవైపు హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు పై పోలీసులు తాజాగా చార్జీ షీట్ దాఖలు చేశారు. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు. రాజ్ తరుణ్-లావణ్య పెళ్లి జరిగిన తరువాత ఓ వీడియో మీడియాకు ఇచ్చింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు,  లావణ్య తల్లిదండ్రులు ఉన్నట్టు చెప్పింది.  పెళ్లి జరిగిన తరువాత తీసిన వీడియోను కూడా పోలీసులకు అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. తన భర్త రాజ్ తరుణే అని.. ఆయన వల్లనే కొన్నాళ్ల క్రితమే గర్భం దాల్చానని కూడా వెల్లడించింది. ముఖ్యంగా సంసారం చేస్తే.. ఇలాంటి గర్భాలు ఎన్నో ఆటోమెటిక్ గా వస్తాయని మీడియాకు వెల్లడించింది లావణ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version