Ram Charan: రామ్ చరణ్‌తో పంజాబ్ పోలీసుల సందడి..సెల్ఫీల కోసం రిక్వెస్ట్

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ఆ ఫిల్మ్ చూసిన ప్రతీ ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రామ్ చరణ్, తారక్ ల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ అని తెగ పొగిడేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా పోలీసులకు అయితే రామ్ చరణ్ రోల్ బాగా నచ్చుతున్నది.

పిక్చర్ లో రామ్ చరణ్ ‘రామ రాజు’ అనే పవర్ ఫుల్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాడు. ఈ క్రమంలోనే సినిమాలోని రామ్ చరణ్ ను చూసిన రియల్ పోలీసులు బయట కనబడగానే సెల్ఫీలు దిగాలనుకుంటున్నట్లున్నారు. రామ్ చరణ్ ప్రజెంట్ తన నెక్స్ట్ ఫిల్మ్ RC 15 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ పంజాబ్ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ షూటింగ్ నిమిత్తం పనుల్లో రామ్ చరణ్ బిజీగా ఉండగా, ఆయనతో ఫొటోలు దిగేందుకు పంజాబ్ పోలీసులు వచ్చారు. తమతో ఫొటోలు దిగాలని రామ్ చరణ్ ను రిక్వెస్ట్ చేశారట. దాంతో రామ్ చరణ్ పంజాబ్ పోలీసు అధికారులందరితో ఫొటోలు దిగారు.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. చెర్రీకి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news