గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదు – హీరో విక్రమ్ మేనేజర్

-

చియాన్ విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు అంటూ వచ్చిన వార్తలతో అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హీరో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విక్రమ్ కు ఈ మధ్యాహ్నం చాతిలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడం తో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు.

ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని, వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా వ్యవహరించరాదని హితవు పలికారు. ఈ అధికారిక ప్రకటన తో విక్రమ్ ఆరోగ్యం విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూర్యనారాయణన్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news